ఆర్టికల్35 రద్దుతో వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు

ఆర్టికల్35 రద్దుతో వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : భారత రాజ్యంగంలోని ఆర్టికల్‌ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 35ఎ జమ్మూకాశ్మీర్‌లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవీ చంద్రచూడ్‌ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలతో పాటు భూమిని కొనుగోలు చేయాలనుకునే హక్కులను ఆర్టికల్‌ 35ఏ పౌరుల నుంచి దూరం చేసిందని తెలిపారు. వీటిపై జమ్మూకశ్మీర్‌ లో నివసించే ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల.. ఇతరులు(రాష్ట్రేతరులు) ఈ హక్కులను కోల్పోయారని అన్నారు. అయితే.. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగం కంటే ఉన్నతమైందని తెలిపిన కేంద్రప్రభుత్వ వాదనను సీజేఐ ఏకీభవించారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తి కొనుగోలు, సెటిల్‌మెంట్‌ పరంగా ప్రత్యేక హక్కులు కూడా అందించాయి. 

సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370, 35ఏను కేంద్రం రద్దు చేయడం వల్ల జమ్మూకశ్మీర్‌లోని శాశ్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఒకేవిధంగా ఉంచిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందన్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లోనూ విద్యాహక్కు అమలవుతోందని ఉదాహరణగా చెప్పారు.