సెంట్రింగ్ సామాగ్రే ఆ మహిళల టార్గెట్.. దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

సెంట్రింగ్ సామాగ్రే ఆ మహిళల టార్గెట్.. దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

మియాపూర్, వెలుగు: భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్​సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠా సభ్యులను మియాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల విలువైన సెంట్రింగ్​సామాగ్రి, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మియాపూర్​ఏసీపీ శ్రీనివాస్​కుమార్​గురువారం వెల్లడించారు. సైదాబాద్​లోని సింగరేణి కాలనీకి చెందిన పద్మ, బిల్లావత్​లక్ష్మి, నేనావత్ అమృత, సభావత్​సునీత, వదిత్య, అనిత, నేనావత్​చందర్​కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. 

నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని దొంగిలించడం టార్గెట్​గా పెట్టుకున్నారు. ముఠాలోని పలువురు సభ్యులు ఆటోల్లో పలు కాలనీల్లో తిరుగుతూ నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్​ల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి ఆటోల్లో వచ్చి బిల్డింగ్​వద్ద ఉన్న సెంట్రింగ్​సామాగ్రిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 19న మియాపూర్​లోని ఓ భవన నిర్మాణం వద్ద ఉన్న సెంట్రింగ్​ సామాగ్రిని దొంగలించారు. 

ఈ ఘటనపై బిల్డింగ్​ఓనర్ ఫిర్యాదుతో మియాపూర్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్​ చందర్​తో పాటు ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు.