కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమన్న హైకోర్టు
  • ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సింగిల్ జడ్జి బెంచ్

హైదరాబాద్‌ : ఫాం హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది. తీర్పుపై 3 వారాలు స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో తో ఫాం హౌస్ కేసులో సీబీఐ విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అప్పగించాలని సీబీఐ మంగళవారమే సీబీఐకు లేఖ రాసింది. అవి అందిన వెంటనే సీబీఐ అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశముంది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించి ఆర్డర్ను సస్పెండ్ చేయాలని కోరింది. అయితే ప్రభుత్వ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి గతంలో ఈ అంశంపై విచారణకు సీజే బెంచ్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన న్యామూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో ధర్మాసనం కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరపలేమని సింగిల్ జడ్జి బెంట్ స్పష్టం చేసింది.