- మేనిఫెస్టోలో జర్నలిస్టుల అంశాలు చేర్చాలి
- రేవంత్కు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలి స్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను చేర్చా లని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక విజ్ఞప్తి చేసింది. సోమవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అధ్యయన వేదిక నేతలు కలిసి 9 ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశారు. అందులో ‘‘వర్కింగ్ జర్న లిస్ట్ యాక్ట్ ను మళ్లీ తీసుకొచ్చి అందులో ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఉద్యోగ రక్షణ నిబంధనలను పొందుపరచాలి.
ఈఎస్ఐ, పీఎఫ్ కట్టకుండా వేతనాలు ఎగ్గొడ్తున్న యాజమాన్యాలను కార్మిక చట్టం పరిధిలోకి తీసుకురావాలి. మీడియా అకాడమీకి వెల్ఫేర్ ఫండ్ను రూ.200 కోట్లకు పెంచాలి. వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు.. ఆ కుటుంబానికి నెలకు రూ.5000 పింఛన్ ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు.