హోరాహోరీగా గురుకులం క్రీడా పోటీలు

హోరాహోరీగా గురుకులం క్రీడా పోటీలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం గిరిజన గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ గిరిజన గురుకుల 6వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడా పోటీల్లో రెండో రోజు ఆదివారం అథ్లెటిక్స్ అండర్ -17 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో  పి.శ్రీ తేజ ఫస్ట్​(భద్రాచలం), ఎ. వైష్ణవి సెకండ్​(ఇచ్చోడు), 400 మీటర్ల పరుగు పందెంలో కె.నందిని ఫస్ట్(ఎల్లారెడ్డి), కె జాహ్నవి సెకండ్​(భద్రాచలం), 800 మీటర్ల పరుగు పందెంలో  కె. నందిని ఫస్ట్, ఆర్. మౌనిక సెకండ్​(సిరిసిల్ల), 300 మీటర్ల పరుగు పందెంలో ఎల్.అఖిల ఫస్ట్​(ఎల్లారెడ్డి), ఎం. సింధు సెకండ్​(జడ్చర్ల), లాంగ్ జంప్ లో పి. శ్రీతేజ ఫస్ట్, ఎం.సరస్వతి సెకండ్​(జైనూర్), షాట్ ఫుట్ లో పి.శ్రీతేజ ఫస్ట్, బి. పల్లవి సెకండ్​(ఇంద్రవల్లి), డిస్క్ త్రో లో వై. బిందుప్రియ ఫస్ట్​(కాటారం), పి.పల్లవి సెకండ్​(ఇంద్రవెల్లి) ప్లేస్​లో నిలిచారు.

అండర్ 14 విభాగంలో 400 మీటర్ల విభాగంలో ఎం. నక్షత్ర ఫస్ట్​(ఎల్లారెడ్డి), బి. లావణ్య సెకండ్​(చేగుంట), 600 మీటర్ల విభాగంలో పి. ఇందు ఫస్ట్​(భద్రాచలం), ఎ. నక్షత్ర సెకండ్​(ఎల్లారెడ్డి), లాంగ్ జంప్ లో పి.ఇందు ఫస్ట్, సీహెచ్. సబిత సెకండ్​(కొత్తగూడెం), షార్ట్ పుట్ లో  పి.ఇందు ఫస్ట్​(భద్రాచలం), కె. సంధ్య సెకండ్​(జై నూరు), డిస్క్​త్రోలో  బి.వైశాలి ఫస్ట్​(ఆసిఫాబాద్), జి.శ్రీదేవి సెకండ్​(తుంగతుర్తి), అండర్ -19 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో బి.వెన్నెల ఫస్ట్​(పాలకుర్తి), నిఖిత సెకండ్​(ఏటూరు నాగారం), 400 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్​(ఎల్లారెడ్డి), పి. దివ్య సెకండ్​(భద్రాచలం), 800 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్, ఆర్.కళావతి సెకండ్​(దామరచర్ల), 300 మీటర్ల పరుగు పందెంలో బి.హరిత ఫస్ట్, ఆర్.కళావతి సెకండ్, లాంగ్ జంప్ లో నిఖిత ఫస్ట్, కె. దీపిక సెకండ్​(కల్వకుర్తి), షాట్ పుట్ లో కె.పల్లవి ఫస్ట్​(సుదిమల్ల), కె.వెన్నెల సెకండ్​(అంకంపాలెం), డిస్క్​త్రోలో కె.వెన్నెల ఫస్ట్, టి.చంద్రకళ సెకండ్​(అంకంపాలెం) ప్లేస్​సాధించారు.