ముగిసిన త్రిరాత్రి ఉత్సవాలు

ముగిసిన త్రిరాత్రి ఉత్సవాలు

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో త్రిరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ముగిశాయి. శివ కళ్యాణ మహోత్సవానికి ముందు మూడు రోజులపాటు త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. చివరి రోజు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామికి ఆలయ

స్థానచార్యులు అప్పాల భీమాశంకర్​ శర్మ ఆధ్వర్యంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో  ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలకరించి డోలోత్సవం నిర్వహించారు.