న్యూఢిల్లీ: డిమాండ్ పుంజుకోకపోతే వెహికల్ విడిభాగాల ఇండస్ట్రీ మరింత ప్రమాదంలో పడుతుందని తాజాగా వెల్లడయింది. గిరాకీ పెరగకపోతే చాలా మంది జాబ్స్ కోల్పోతారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) హెచ్చరించింది. ఆటో కాంపోనెంట్ మార్కెట్లో ఇన్వెంటరీ పేరుకుపోగా, డిమాండ్ మాత్రం ఇంకా పుంజుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు ఉద్యోగులను విపరీతంగా తొలగిస్తాయని అసోసియేషన్ ఆందోళన ప్రకటించింది. ‘‘గిరాకీ పెరిగే వరకు కంపెనీలకు డబ్బు సమస్యలు ఉంటాయి. ఉద్యోగులను తీసేయడమూ తప్పదు. పరిస్థితి మామూలు స్థితికి వస్తేనే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి’’ అని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అన్నారు. కంపెనీలు పూర్తిస్థాయిలో పనిచేసినా, ఉద్యోగులందరూ అవసరం లేదని, డిమాండ్ తక్కువ ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. లాక్డౌన్ వల్ల గిరాకీ 40 శాతం వరకు తగ్గుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ ఇది వరకే చెప్పిన విషయాన్ని దీపక్ గుర్తుచేశారు. దీనినిబట్టి చూస్తే జాబ్కట్స్ తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీలో దాదాపు 50 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. గత ఏడాది దీని మార్కెట్ 18 శాతం తగ్గింది. మనదేశంలో టూరిజం, ఏవియేషన్ వంటి ఐదు సెక్టార్ల తరువాత అత్యంత ఒత్తిడిలో ఉన్న వాటిలో ఆటో కాంపోనెంట్ సెక్టార్ ఒకటని దీపక్ వివరించారు. డిమాండ్ పెరగాలంటే ఆటోలోన్స్ పెరగాలని, సర్వీసు స్టేషన్లను ఎంఎస్ఎంఈలుగా పరిగణించాలని అన్నారు.
బండ్లకు డిమాండ్ తగ్గితే గండమే
- బిజినెస్
- June 8, 2020
లేటెస్ట్
- మనల్ని కాదని సర్కార్ నడుస్తదా.?: ఎమ్మెల్యే తలసాని
- కాంగ్రెస్ చార్జిషీట్లో చార్జీ లేదు.. షీటు లేదు: మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
- మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు
- RCB vs SRH మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- మోదీ వంద మంది హిట్లర్లతో సమానం
- కాంగ్రెస్లో చేరిన వట్టికూటి
- వరంగల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
- రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు
- ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న