కోట్లు విలువ చేసే భూముల్లో రైల్వే లైన్ ఎలా వేస్తారు?

 కోట్లు విలువ చేసే భూముల్లో రైల్వే లైన్ ఎలా వేస్తారు?

కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు బాధితులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో.. RDO శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో రైల్వే లైన్ ఎలా వేస్తారని ప్రశ్నించింది బాధితురాలు అమృతవ్వ. ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నామని... భూమి పోతే ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం KCR ఎలాగైనా అలైన్మెంట్ రూట్ మార్చాలని వేడుకుంది. లేక పోతే ఓట్లు వేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది అమృతవ్వ.