- ఆదిలాబాద్ జిల్లాలోని ఓ కార్ షోరూంలో ఘటన
ఆదిలాబాద్టౌన్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఓ కారు షోరూంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్మన్కు గన్చూపించి లాకర్ ఎత్తుకుపోయారు. మావల మండల కేంద్రంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆదర్శ మోటర్మారుతి సుజుకీ కార్ షోరూమ్లో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ ముసుగులు ధరించిన నలుగురు దుండగులు డమ్మీ తుపాకీ, రాడ్డుతో షోరూమ్ నైట్డ్యూటీ వాచ్మెన్ భూమన్నను బెదిరించి వర్క్షాప్ బాత్రూమ్లో బంధించారు. తర్వాత షోరూమ్లోని లాకర్ఎత్తుకెళ్లారు. అందులో రూ.3 లక్షల వరకు నగదు ఉందని సిబ్బంది తెలిపారు. సంఘటన స్థలానికి డీఎస్పీ ఉమేందర్, సీఐ రఘుపతి, ఎస్సై విష్ణువర్ధన్వచ్చి విచారణ చేపట్టారు.
తెలిసిన వాళ్ల పనేనా?
కారు షోరూమ్లో రోజూ వచ్చే బుకింగ్స్కు సంబంధించి డబ్బులను లాకర్లో పెట్టేవారు కాదు. మంగళవారం ఆర్డర్లు ఎక్కువగా రావడంతో డబ్బులను బయటకు తీసుకువెళ్లడం సేఫ్కాదని లాకర్లో ఉంచారు. రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య షోరూమ్బంద్చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ విషయం షోరూమ్లో పని చేసే సిబ్బందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే షోరూమ్కు వచ్చిన బయటి వ్యక్తులు ఎవరైనా డబ్బులు పెడుతున్నప్పుడు చూసి ఉండవచ్చనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:50 మధ్య చోరీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజీలో నలుగురు వ్యక్తులు కనిపించారని, దాని ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.