ఆహారం కల్తీ చేస్తే కేసులు నమోదు : అడిషనల్ కలెక్టర్ఏ భాస్కరరావు

ఆహారం కల్తీ చేస్తే కేసులు నమోదు : అడిషనల్ కలెక్టర్ఏ భాస్కరరావు

యాదాద్రి, వెలుగు:  ఆహార భద్రత నిబంధనలను పట్టించుకోకుండా కల్తీ చేస్తే కేసులు నమోదు చేస్తామని అడిషనల్ కలెక్టర్​ఏ భాస్కరరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌‌లో నిర్వహించిన డిస్ట్రిక్​ లెవల్​ఫుడ్​సేఫ్టీ అడ్వైజరీ ​కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  కొన్ని హోటల్స్​లో ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కల్తీ నూనె వాడడంతో పాటు నూనె ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు.

ఆకర్షణీయంగా కన్పించాలన్న ఉద్దేశంతో స్వీట్స్​లో కలర్స్​ ఉపయోగిస్తున్నారన్నారు.  కుళ్లిన కూరగాయలు వాడడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయన్నారు. మీటింగ్​లో ఎస్పీ అక్షాంశ్​యాదవ్​, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఏవో రమణారెడ్డి, డీఎంహెచ్​వో మనోహర్​, డీఈవో సత్యనారాయణ, సివిల్ సప్లయ్​ఆఫీసర్​రోజారాణి, ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్​స్వాతి ఉన్నారు.