జర్మనీ, స్పెయిన్పై తీవ్ర ప్రభావం: డబ్ల్యూహెచ్వో
కోపెన్హాగెన్(డెన్మార్క్): హీట్ వేవ్స్ కారణంగా 2022లో యూరప్లో మొత్తం 15 వేల మంది వరకు చనిపోయినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) మంగళవారం ప్రకటించింది. స్పెయిన్, జర్మనీపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య యూరప్ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు కావడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. జర్మనీలో అత్యధికంగా 4,500 మంది, స్పెయిన్లో 4వేల మంది చనిపోయినట్టు డబ్ల్యూహెచ్ వో యూరప్ రీజినల్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు. పోర్చుగల్లో 1,000 మంది, బ్రిటన్లో 3,200 మంది చనిపోయినట్టు వివరించారు. టెంపరేచర్ కారణంగా వివిధ దేశాలు వేసుకున్న అంచనాల కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తాయన్నారు.
ఈజిప్ట్లో జరిగిన యూఎన్ క్లైమెట్ సమ్మిట్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని గుర్తు చేశారు. అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చుల కారణంగా కరువుతో పాటు వాతావరణంలో వేడి పెరిగిందని తెలిపారు. పవర్ గ్రిడ్పై ఒత్తిడి పడటంతో.. పంటలన్నీ ఎండిపోయాయన్నారు. జూన్– జులై మధ్య బ్రిటన్లో రికార్డు స్థాయిలో 40డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు వివరించారు. బాడీలో టెంపరేచర్ పెరగడంతోనే యూరప్ రీజియన్లో ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. గుండె జబ్బులు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్తో బాధపడే వారి శరీరంలో టెంపరేచర్ పెరగడం ప్రమాదకరమని వివరించారు. ఇది కొందరిలో మరణానికి దారితీస్తుందన్నారు. హీట్ వేవ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు ప్రజలు మరిన్ని వ్యాధుల బారినపడుతారని తెలిపారు. దీంతో రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తాయని హెచ్చరించారు.