![తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి](https://static.v6velugu.com/uploads/2024/05/59_Lk1xA4VqnN.jpg)
- నల్గొండ-ఖమ్మం-వరంగల్ నేతలతో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్ సూచించారు. క్షేత్ర స్థాయి ప్రచారంపై దృష్టి సారించాలన్నారు.
ఈ మేరకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నారు.