
- ఇండ్లల్లో చోరీలు.. ఇద్దరు అరెస్ట్
- 130 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి స్వాధీనం
సికింద్రాబాద్, వెలుగు: ఇండ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైదాబాద్లోని సంతోశ్ నగర్ కు చెందిన సయ్యద్ మహబూబ్ అలీ అలియాస్ ఖుస్రో(42) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి జల్సాలకు బానిసై మహబూబ్ ఈజీ మనీ కోసం ఇండ్లల్లో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. సిటీ, సైబరాబాద్ కమిషనరేట్లలోని పీఎస్ల పరిధిలో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా మహబూబ్ తీరు మారలేదు. 2020లో సంతోశ్నగర్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపారు.
ఈ ఏడాది జులైలో బయటికి వచ్చిన మహబూబ్ తలాబ్ కట్టకు చెందిన తన చిన్నప్పటి ఫ్రెండ్ మహ్మద్ ఫిరోజ్(30)తో కలిసి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. వీరిద్దరు కలిసి ఆరు ఇండ్లల్లో చోరీలు చేశారు. వీరిపై ఎయిర్పోర్టు పీఎస్, మీర్ చౌక్ పీఎస్ల పరిధిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మంగళవారం చిలకలగూడలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి దగ్గరి నుంచి రూ. 7 లక్షలు విలువైన 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. వారిని రిమాండ్కు తరలించినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.