ఏపీలో కొత్తగా 6,213 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 6,213 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 35,035 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 830, తూర్పు గోదావరి జిల్లాలో 731 కేసులు గుర్తించారు.

మరోవైపు  10,795 మంది కరోనా నుంచి కోలుకోగా..ఐదుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,82,583 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,62,033 మంది కోలుకున్నారు. ఇంకా 1,05,930 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,620కి పెరిగింది.

మరిన్ని వార్తల కోసం..

 

దేశంలో ఎక్కడైనా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్