ముంబై: బిజినెస్ నిర్వహణ ఈజీ చేసేందుకు ఫార్మా ఇండస్ట్రీకి రూల్స్బెడదను తగ్గించనున్నట్లు కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మినిస్టర్ మన్శుక్ మాండవీయ చెప్పారు. పరిశ్రమ రంగంతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలనేదే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఈవెంట్లో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఐడీఎంఏ ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్కు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వ్యాపారాన్ని ఈజీగా చేసుకునేలా చూడాలనేదే తమ ఫోకస్అని మన్శుక్ మాండవీయ పేర్కొన్నారు.
ఈ దిశలోనే , కొత్త పాలసీలను తెచ్చే ముందు సంబంధిత వర్గాలు అందరితోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయడం వల్లే ఇప్పుడు గ్లోబల్గా మన ఫార్మా ఇండస్ట్రీ కి మంచి పేరు వచ్చిందన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఫార్మా ఇండస్ట్రీ కోసం రూ. 15 వేల కోట్ల పీఎల్ఐ స్కీమును అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా దిగుమతి చేసుకుంటున్న 35 ఏపీఐలు ఇప్పుడు మన దేశంలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.