ఆర్మీ ట్రక్కు ప్రమాదం : జవాన్ వీరమరణంతో తిర్మాన్ దేవునిపల్లిలో విషాదం

ఆర్మీ ట్రక్కు ప్రమాదం : జవాన్ వీరమరణంతో తిర్మాన్ దేవునిపల్లిలో విషాదం

లడఖ్ లోని లేహ్ లో శనివారం రోజు (ఆగస్టు 19వ తేదీన) జరిగిన ట్రక్కు ప్రమాదంలో వీరమరణం చెందిన వారిలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఉన్నారు. భారత ఆర్మీ కాన్వాయ్ లోని ట్రక్కు నదిలో పడిపోయి వీర మరణం చెందిన వారిలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం తిర్మాన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (భారత జవాన్ ) ఉన్నారు. శేఖర్ వీరమరణంతో దేవునిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.

శేఖర్ మృతి వార్త తెలిసినప్పటి నుంచి ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2011లో భారత ఆర్మీలో శేఖర్ జాయిన్ అయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భార్యా పిల్లలు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలోనే ఉంటున్నారు. ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో 9 మంది జవాన్లు వీరమరణం చెందిన విషయం తెలిసిందే.