చెన్నై సిల్క్స్​ షోరూమ్ లో చోరీ.. పట్టు చీరలను ఎత్తుకెళ్లిన దొంగలు

చెన్నై సిల్క్స్​ షోరూమ్ లో చోరీ.. పట్టు చీరలను ఎత్తుకెళ్లిన దొంగలు

మెహిదీపట్నం, వెలుగు : అర్ధరాత్రి చెన్నై సిల్క్స్ షోరూమ్ లోకి వచ్చిన దొంగలు పట్టు చీరలు, వెండి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ  గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023, ఆగస్ట్ 9వ తేదీ బుధవారం అర్థరాత్రి మెహిదీపట్నంలోని చెన్నై సిల్క్స్ బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి షోరూమ్ లోపలికి వెళ్లిన దొంగలుగ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 4 కిలోల వెండి నగలు , పట్టు చీరలను తీసుకుని పరారయ్యారు.

గురువారం ఉదయం సిబ్బంది షోరూమ్ ను ఓపెన్ చేయగా.. వెండి నగలు, పట్టు చీరలు కనిపించలేదు. దీంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.