చెయ్యి విరిగిందని ఓ పిల్లాడిని ఆస్పత్రికి తీసుకువెళ్తే చివరికి అతని ప్రాణమే పోయింది. చెన్నారావుపేట సిద్దార్థ హైస్కూల్లో 3వ తరగతి చదువుతున్న భూక్య నిహాన్ ఈ నెల 4న స్కూల్ ఆవరణలో జారుడుబండ ఆడుతూ కిందపడిపోయాడు. దీంతో అతని కుడి చేయి ప్రాక్చర్ అయింది. స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి పేరెంట్స్కు అప్పజెప్పారు. అదే రోజు సాయింత్రం బాబును అతని పేరెంట్స్ వరంగల్ లోని ఎంజీఎంలో అడ్మిట్ చేశారు.
సోమవారం బాబును అబ్జర్వ్లో ఉంచిన డాక్టర్లు... మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. గంట తర్వాత బాబు చనిపోయినట్లుగా పేరెంట్స్కు చెప్పారు. అనస్థీషియా డోస్ ఎక్కువ అవడం వల్లే బాబు చనిపోయినట్టు తెలుస్తోంది. హాస్పిటల్, డాక్టర్ల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెబుతున్నారు.