ప్రజా సమస్యలపై చర్చ జరగాలి

ప్రజా సమస్యలపై చర్చ జరగాలి

ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు అన్నారు మోడీ. సమావేశాలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని. ప్రభుత్వం ప్రతీ ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు ప్రధాని. దీంతో పాటు కొత్త వేరియంట్ పట్ల కూడా మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.