
జనవరి చివరి నాటికి అవుట్స్టాండింగ్ రూ. 1.87 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి చివరినాటికి క్రెడిట్ కార్డుల అవుట్స్టాండింగ్ 29.6 శాతం పెరిగి రూ. 1.87 లక్షల కోట్ల ఆల్టైమ్ హై మార్కును అందుకుంది. డిజిటైజేషన్ జోరుతోపాటు, కొవిడ్ తర్వాత కన్జూమర్ల కాన్ఫిడెన్స్ పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లోని 10 నెలల్లో క్రెడిట్ కార్డుల అవుట్స్టాండింగ్20 శాతం పైనే పెరిగింది. జూన్ 2022 లో అత్యధికంగా 30.7 శాతం అవుట్స్టాండింగ్ నమోదయింది. చాలా కేటగిరీలలో డిజిటైజేషన్ జరగడంతో, కస్టమర్లు క్రెడిట్ కార్డుల ద్వారా తమ ఖర్చులను పెంచారని ఎస్బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ మోహన్ రావు అమర చెప్పారు. హెల్త్, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, యుటిలిటీ బిల్లులు వంటి వాటితోపాటు ఇతర చెల్లింపులు కూడా ఈజీ కావడంతో కస్టమర్లు ఒకింత ఎక్కువగానే తమ ఖర్చులకు క్రెడిట్ కార్డులను వాడుతున్నారని పేర్కొన్నారు.
క్రెడిట్కార్డుల వినియోగం నెలవారీ ట్రెండ్స్గురించి మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా నిలకడగా కార్డులతో ఖర్చు పెరుగుతోందన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన ఖర్చు రూ. 1.28 లక్షల కోట్లని, అంతకు ముందు నెల అంటే డిసెంబర్2022 లో ఇది రూ. 1.26 లక్షల కోట్లని రావు వెల్లడించారు. ఏడాది కాలానికి చూస్తే ఈ గ్రోత్ 45 శాతం దాకా ఉందని చెప్పారు. గత 11 నెలల కాలంలో ప్రతి నెలా క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు రూ. 1 లక్ష కోట్ల మార్కుకు పైనే ఉందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డుల అవుట్స్టాండింగ్ఈ ఏడాది జనవరిలో 29.6 శాతం గ్రోత్ కనబరిచిందని, అంతకు ముందు ఏడాది జనవరిలో ఇది 10 శాతమేనని ఆర్బీఐ డేటా చెబుతోంది. 2022 జనవరి చివరినాటికి క్రెడిట్ కార్డుల అవుట్స్టాండింగ్ మొత్తం రూ. 1,41,254 కోట్లని, ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది రూ. 1,86,783 కోట్లకు పెరిగిందని డేటా పేర్కొంటోంది. కన్జూమర్లలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని ఆర్బీఐ తాజా సర్వే వెల్లడించింది. సాధారణ ఎకనమిక్ సిట్యుయేషన్తోపాఉట, హౌస్హోల్డ్ ఇన్కమ్ విషయంలోనూ కన్జూమర్ల సెంటిమెంట్ మెరుగైనట్లు పేర్కొంది. 2022 డిసెంబర్ నెలలో మొత్తం క్రెడిట్ కార్డుల ఖర్చులో 60 శాతం ఈ–కామర్స్ కొనుగోళ్లేనని ఎస్బీఐ కార్డ్ ఎండీ రావు చెప్పారు. హోలీ పండగతోపాటు, వచ్చేది సమ్మర్ సీజన్ కావడంతో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. కరోనా టైములో గ్రోసరీలు కొనడానికి, యుటిలిటీ బిల్లులు కట్టడానికి మాత్రమే క్రెడిట్ కార్డులను వాడారని, ఫ్యూయెల్, ట్రావెల్, ఎంటర్టెయిన్మెంట్వంటి వాటిపై క్రెడిట్ కార్డుల వినియోగం అప్పట్లో బాగా పడిపోయిందని ఆండ్రోమెడా వైస్ చైర్మన్ స్వామినాథన్ వివరించారు.
దేశంలో 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు....
జనవరి 2023 చివరి నాటికి దేశంలో మొత్తం 8.25 కోట్ల క్రెడిట్ కార్డులున్నాయి. హెచ్చ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్లు క్రెడిట్ కార్డుల జారీలో ముందుంటున్నాయి. మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి సెక్యూర్డ్ లోన్స్ కంటే పర్సనల్లోన్స్ సెగ్మెంటే వేగంగా పెరుగుతోందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి స్వామినాథన్ చెప్పారు. కొత్తగా ఉద్యోగాలలో చేరుతున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఆర్థికపరమైన అవగాహన ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు యాక్టివ్గా వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చాలా ఫిన్టెక్ కంపెనీలు ఆన్లైన్ బాట పట్టడంతోపాటు ఇన్ఫర్మేషన్ను కూడా షేర్ చేస్తుండటంతో...యువత ముందుగా అన్నీ తెలుసుకునే క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని స్వామినాథన్ వెల్లడించారు.