అరుదైన ఆహ్వానం అందుకున్న మృణాల్ ఠాకూర్

అరుదైన ఆహ్వానం అందుకున్న మృణాల్ ఠాకూర్

సీతారామం మూవీతో అందరి మనసులను దోచేసుకున్న బ్యూటీ  మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).  ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా నిలిచినా మృణాల్ టాలీవుడ్ లో బాగా బిజీగా అయింది. తాజాగా ఈ అమ్మడికి సైమా(SIIMA ) అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. యూఏఈ లో జరుగబోతున్న ఈ కార్యక్రమంలో ఈ అందాల ముద్దుగుమ్మ పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. 

'ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే వేడుకలకు ఇంత త్వరగా అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ ఈవెంట్‌లో భాగం కావాలని నన్ను ఆహ్వానించినందుకు సైమా అవార్డ్స్ వారికి  ధన్యవాదాలు. నాకు సైమా అనేది చాలా స్పెషల్.. ఎంతో మంది ప్రతిభావంతులను నిలకడగా ప్రోత్సహించి, సత్కరిస్తున్న వేదిక' అంటూ తన సోషల్ మీడియాలో పంచుకుంది. 

దుబాయ్ లో సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఎంతో ఘనంగా జరగనుంది. సైమా ఈవెంట్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మరియు మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. రానా దగ్గుబాటి(ranadaggubati )  తో కలిసి సైమా హంగామా ఎంజాయ్ చేసినట్లు తెలిపింది.
 
విజయ దేవరకొండ---(Vijay Deverakonda ), పరుశురాం(Parasuram) మూవీలో ఛాన్సు కొట్టేసిన ఈ భామ, నాని(NANI30) గా వస్తున్న మూవీలో కూడా నటించబోతుంది. ఈ రెండు మూవీస్ తో మరోసారి సక్సెస్ అవ్వాలంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.