- ఈసారి వృద్ధ నేతలకు టికెట్ఇవ్వొద్దంటున్న అక్బరుద్దీన్
- అనుభవజ్ఞుల సేవలను పార్టీకి వాడుకోవాలంటున్న అసద్
- మూడు సెగ్మెంట్లలో అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్
హైదరాబాద్,వెలుగు : మజ్లిస్పార్టీలో ఇంటిపోరు తయారైంది. ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్స్థానాల్లోనే కాకుండా మరికొన్ని చోట్ల పోటీ చేసి గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది. మరోవైపు పార్టీ నేతల్లో కొత్తగా విభిన్న వాదనలు చర్చనీయాంశంగా మారాయి. మజ్లిస్లో ఏకచత్రాధిపత్యమే నడుస్తుండగా ఈసారి మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తుంది. పార్టీ అధినేత అసదుద్దీన్ఓవైసీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేకుండా పోయింది. అధినేత సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ, మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరాలు పెంచుతున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఏకంగా అక్బరుద్దీన్ఓవైసీ పార్టీలోని కొందరు అభ్యర్థులను మార్చాలని కోరుతుండగా, మరో ఎమ్మెల్యే తనకు కానీ తన కుమారుడికి కానీ టికెట్ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ సవాల్చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా మజ్లిస్లో ఇంటిపోరు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తుంది. దీంతో ఈసారి పార్టీ నుంచి బరిలో సిట్టింగ్లే ఉంటారా? లేదంటే కొత్త వారికి చాన్స్ ఇస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. పార్టీలో వర్గపోరుకు దారుస్సలాం కేంద్రంగా ఉంది.
యువతకే ప్రాధాన్యమంటూ..
ఈసారి ఎన్నికల్లో యువత పోటీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అక్బరుద్దీన్ఓవైసీ వాదిస్తున్నట్టు, కొన్ని స్థానాల్లో కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా, నాంపల్లి, మలక్పేట, కార్వాన్సెగ్మెంట్ల నుంచి సిట్టింగ్ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో నాంపల్లి ఎమ్మెల్యే మెరాజ్హుస్సేన్ ను మార్చి అక్కడి నుంచి మాజీ మేయర్ మాజిద్హుస్సేన్ను పోటీకి దింపాలని, అలాగే మెరాజ్ హుస్సేన్ను యాకుత్పురా నుంచి పోటీ చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తుంది.
యాకుత్పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రికి ఈసారి టికెట్ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన వయోభారంతో పోటీకి నిలుపవద్దనుకుంటున్నారు. చార్మినార్నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్అహ్మద్ఖాన్కు సైతం ఈసారి టికెట్ఇవ్వకుండా అక్బరుద్దీన్కుమారుడు నూరుద్దీన్ ను పోటీకి దింపాలని అక్బర్ ఆలోచన చేస్తున్నారు. ఇలా మజ్లిస్ కు కీలకమైన 3 నియోజకవర్గాలపై అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది.
ఇండిపెండెంట్గా చేస్తానంటూ సవాల్
చార్మినార్, యాకుత్పురా నుంచి వృద్ధ నేతలను కాకుండా యువ నేతలను పోటీకి నిలపాలని భావిస్తుండగా.. ఎమ్మెల్యేలు పాషాఖాద్రి, ముంతాజ్ను పక్కనబెట్టాలని నిర్ణయించారు. చార్మినార్ఎమ్మెల్యే ముంతాజ్అహ్మద్తనకు టికెట్ఇవ్వకపోతే తన కొడుకు ఇంతియాజ్ఖాన్ఇవ్వాలని డిమాండ్చేస్తున్నారు. కాదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సవాల్చేస్తున్నట్టు పార్టీలోని కొందరు నేతలు తెలిపారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా తనకైనా.. లేదా తన కొడుకుకైనా ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఇలా ఎన్నడూ లేని విధంగా పార్టీలో విభిన్న వాదనలు వినిపిస్తుండగా పార్టీ అధినేత అసదుద్దీన్ సతమతం అవుతున్నట్టు సమాచారం. యువతకు ప్రాధాన్యత ఇస్తూనే అనుభవజ్ఞులను కూడా పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కానీ అక్బరుద్దీన్ఏకంగా యువతకే పోటీ చేసే చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతుండగా పార్టీలో ఇంటిపోరు తీవ్రంగా ఉంది.