చైనాతో ముప్పు.. మోడీనే కాపాడాలె

చైనాతో ముప్పు.. మోడీనే కాపాడాలె
  • చైనాతో ముప్పు.. మోడీనే కాపాడాలె
  • కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ట్వీట్

న్యూఢిల్లీ: చైనాతో మన దేశ భద్రతకు ముప్పు ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. తూర్పు లడఖ్ లోని పాంగోంగ్​ సో నదిపై డ్రాగెన్ కంట్రీ రెండో బ్రిడ్జి కడుతోందన్న వార్తల నేపథ్యం లో రాహుల్ శుక్రవారం ట్వీట్ చేశారు. మన దేశ సెక్యూరిటీ విషయంలో చైనాతో చర్చలు వీలుకావని, ప్రధాని నరేంద్ర మోడీనే దేశాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సరస్సుపై ఒక బ్రిడ్జి కట్టిన చైనా.. మరో బ్రిడ్జి నిర్మాణంతో తన సైన్యాన్ని త్వరగా అక్కడ మోహరించేందుకు వీలు పడనుంది.