Pooja Hegde: చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Pooja Hegde: చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

పొడుగుకాళ్ళ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) టాప్ మూవీస్తో కొన్నాళ్ళు టాలీవుడ్ను అట్ట్రాక్ట్ చేసింది. హిట్స్ మీద హిట్స్ కొడుతూ.. కుర్రాళ్ళ గుండెల్లో కొన్నాళ్ళు నిలుచుండేలా సినిమాలు చేసింది. అల్లు అర్జున్తో అలా వైకుంఠ పురం చేసి బుట్ట బొమ్మగా నేషనల్ వైడ్గా బాగ్ ఫేమస్ అయింది. ఐరన్ లెగ్ అంటూ ఇండస్ట్రీ ట్యాగ్ కూడా ఇచ్చేసింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్కు లక్కీ చార్మ్గా మారిన పూజా..సడన్గా ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయింది. వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయి కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. 

లేటెస్ట్గా పూజా హెగ్డేకి సంబంధించిన ఒక తప్పుడు న్యూస్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవలే పూజా హెగ్డే దుబాయ్‌లోని ఓ ఈవెంట్కి వెళ్లారని..అక్కడ ఆమెకు సంబంధించి పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి..ఆమెను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తోన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీంతో పూజా హెగ్డే ఫ్యాన్స్ సపోర్ట్గా నిలుస్తూ..అసలు ఏం జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. 

ఇదే విషయంపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది. అసలు ఇలాంటి వార్తలు వచ్చావంటే..చాలా వరకు ఫేక్గా నిలుస్తాయి.ఇప్పుడు కూడా అలాంటి ఫేక్ వార్తలే అని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా..‘అసలు ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి’ అని పూజా హెగ్డే టీమ్ వెల్లడించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే పూజా టీమ్‌ క్లారిటీ ఇచ్చిన వెంటనే పోస్ట్ చేసిన మీడియా సంస్థ కూడా ఆ వార్తను డిలీట్‌ చేసింది.

ప్రస్తుతం పూజా చేతిలో తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో పూజా నటిస్తోంది.