
నేరెడ్మెట్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ కి చెందిన బానోతు కిరణ్ కుమార్ ప్రాంతానికి చెందిన బానోతు కిరణ్ కుమార్ తన మొబైల్కి కొందరు లింక్ను పంపించి..ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.86 లక్షలను కొట్టేశారని ఈ ఏడాది అక్టోబర్ 22న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నవంబర్ 3న వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులు నూర్ ఆలం, అక్రం హుస్సేన్, ఎండీ ఇజ్రాల్ను అదుపులోకి తీసుకుని రూ. 15 లక్షలు సీజ్ చేశారు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు సూత్రదారి దీపు మండల్ సిలిగురిలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శుక్రవారంసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దీపు మండల గ్యాంగ్ కి చెందిన నేపాలీలు గోపాల్ శేర్ప (24), సుశీల్ గురుంగ్ (29), నిమతమంగ్ అలియాస్ అమ్రిత్తమంగ్ (24)ను అదుపులోకి తీసుకున్నారు. 53 సెల్ ఫోన్లు, 215 సిమ్లు, లక్ష క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అకౌంట్లోని 10 లక్షలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడైన దీపు మండల్ కోసం గాలిస్తున్నామని సీపీ మహేశ్భగవత్ తెలిపారు.