నేరెడ్మెట్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరగాళ్లను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ కి చెందిన బానోతు కిరణ్ కుమార్ ప్రాంతానికి చెందిన బానోతు కిరణ్ కుమార్ తన మొబైల్కి కొందరు లింక్ను పంపించి..ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.86 లక్షలను కొట్టేశారని ఈ ఏడాది అక్టోబర్ 22న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నవంబర్ 3న వెస్ట్ బెంగాల్లోని సిలిగురి ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులు నూర్ ఆలం, అక్రం హుస్సేన్, ఎండీ ఇజ్రాల్ను అదుపులోకి తీసుకుని రూ. 15 లక్షలు సీజ్ చేశారు. విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు సూత్రదారి దీపు మండల్ సిలిగురిలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. శుక్రవారంసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దీపు మండల గ్యాంగ్ కి చెందిన నేపాలీలు గోపాల్ శేర్ప (24), సుశీల్ గురుంగ్ (29), నిమతమంగ్ అలియాస్ అమ్రిత్తమంగ్ (24)ను అదుపులోకి తీసుకున్నారు. 53 సెల్ ఫోన్లు, 215 సిమ్లు, లక్ష క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. అకౌంట్లోని 10 లక్షలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడైన దీపు మండల్ కోసం గాలిస్తున్నామని సీపీ మహేశ్భగవత్ తెలిపారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్
- క్రైమ్
- December 25, 2021
లేటెస్ట్
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
- రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు
- టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- విమానంలో డీజీపీకి అసౌకర్యం