- టాస్క్ఫోర్స్, బేగంపేట పోలీసుల దాడి
- రూ.45వేల విలువైన 11 రకాల మెడిసిన్ సీజ్
సికింద్రాబాద్, వెలుగు: మెడికల్ షాపులో అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.45 వేల విలువైన 11 రకాల డ్రగ్స్కలిగిన మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు, బేగంపేట పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. మారేడుపల్లిలో ఉండే ముఠా కిషోర్(58) ఎలాంటి విద్యార్హత, మెడికల్ ఎక్స్ పీరియన్స్ లేకున్నా.. 20 ఏండ్లుగా మెడికల్ ఫీల్డ్లో ఉంటూ సికింద్రాబాద్ లోని రసూల్ పురాలో మహావీర్ మెడికల్ షాపును నిర్వహిస్తుంది.
మెడికల్ షాపు బొలిశెట్టి అవినాశ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అతని పేరిట షాపును ముఠా కిషోర్ నిర్వహిస్తున్నాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ముఠాకిషోర్ మెడికల్ రిప్రజెంటేటివ్ బోయిన్పల్లికి చెందిన ఇరేని రమేశ్గౌడ్(30) ద్వారా నార్కోటిక్ మందులను కొనుగోలు చేశాడు. వాటిని బేగంపేట్కు చెందిన ముస్లం రాజు(39)తో కలిసి డ్రగ్స్కు ఎడిక్ట్ అయినవారికి వారికి డాక్టర్ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నాడు. రమేశ్గౌడ్నకిలీ బిల్లులతో సరఫరా చేసేవాడు. సమాచారం అందడంతో నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బేగంపేట పోలీ సులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేసి పలు రకాల మెడిసిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో రష్మీ పెరుమాళ్, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ నార్త్ టాస్క్ ఫోర్స్, ఇన్ స్పెక్టర్ గోవింద్ సింగ్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ రామయ్య, బేగంపేట ఎస్ ఐలు అశోక్ రెడ్డి, జ్ఞానదీప్ పాల్గొన్నారు.