క్వారీలో పడి ముగ్గురు మృతి

క్వారీలో పడి ముగ్గురు మృతి

జగద్గిరిగుట్ట పోలీస్ పరిధిలోని గాజులరామరంలో దారుణం జరిగింది.  బాలయ్య నగర్ క్వారీ గుంతలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వాళ్లంతా కర్ణాటకలోని యాద్గిర్  జిల్లా వాసులు. బంధువలింట్లో గృహప్రవేశం కోసం వచ్చిన వీళ్లు… బట్టలు ఉతికేందుకు క్వారీకి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయారు.

యశ్వంత్ అనే అబ్బాయి ముందుగా క్వారీలో పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అతని మేనత్త అనిత… అమ్మమ్మ ఐలమ్మ కూడా క్వారీలో మునిగిపోయారు. స్థానికులు వచ్చి  వారిని బయటకు తీసేలోగా వారు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల నిర్లక్ష్యమే వారి ముగ్గురు ప్రాణాలు తీసిందని ఆరోపించారు గ్రామస్థులు.