ప్రైవేటు క్లినిక్ నడిపిన సర్కారు డాక్టర్లపై వేటు

ప్రైవేటు క్లినిక్ నడిపిన సర్కారు డాక్టర్లపై వేటు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తూ.. ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌ నడిపిస్తున్న ముగ్గురు  డాక్టర్లపై వేటు పడింది. భద్రాచలం ఏరియా హాస్పిటల్‌‌‌‌లో విధుల్లో ఉన్న డాక్టర్లు.. దేవ్‌‌‌‌రాజ్‌‌‌‌, ఎం.రామకృష్ణ, రమేశ్‌‌‌‌చంద్ర డ్యూటీ హవర్స్‌‌‌‌లో తమ సొంత క్లినిక్​లో పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది. దీంతో దేవ్‌‌‌‌రాజ్‌‌‌‌, రామకృష్ణను సస్పెండ్‌‌‌‌ చేస్తూ వైద్య విధాన పరిషత్‌‌‌‌ ఇంచార్జ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ మాణిక్కరాజ్‌‌‌‌ ఉత్తర్వులిచ్చారు. రమేశ్‌‌‌‌చంద్ర కాంట్రాక్టు పోస్టులో ఉండడంతో ..ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని దవాఖాన సూపరింటెండెంట్‌‌‌‌ను మాణిక్కరాజ్‌‌‌‌ ఆదేశించారు.