హైదరాబాద్, వెలుగు : చైనా కేంద్రంగా జరిగిన ఆన్లైన్ మనీ ఫ్రాడ్స్ కేసులో హైదరాబాద్కు చెందిన ముగ్గురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫేక్ బ్యాంక్ ఎకౌంట్స్, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఆడబాల శ్రీనివాసరావు (46), నారల విజయ్ కృష్ణ (37), కన్నరెడ్డి విజయభాస్కర్ రెడ్డి (46) మరో 8 మందితో కలిసి 12 షెల్ కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకోసం ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ఓసీకి అందించారు. ఫేక్ అడ్రస్లు, హౌస్ ఓనర్ల ఫోర్జరీ సంతకాలతో 15 బ్యాంక్ ఎకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇలా క్రియేట్ చేసిన అకౌంట్స్ ఆపరేషన్స్ను చైనా సైబర్ క్రిమినల్స్ జూలీ, మైఖెల్కి అందించారు. దీంతో వారు ఆన్లైన్ లో చేసే ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ ద్వారా కొట్టేసిన మనీ అంతా హైదరాబాద్లోని 15 ఎకౌంట్స్లో డిపాజిట్ అయ్యేవి. ఇక్కడి నుంచి చైనాకు ట్రాన్స్ఫర్ అయ్యేవి. ఫేక్ కంపెనీలను గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన సమాచారంతో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. రెండు బ్యాంక్ అకౌంట్స్లోని రూ.2.42 కోట్లను పోలీసులు గుర్తించి.. ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.