గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య

గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య

అనంతపురం: జిల్లాలోని తనకల్ మండలం కోర్తికోటలో దారుణం జరిగింది. గుప్త నిధుల కోసం  ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా నరికి నరబలి ఇచ్చారు. కోర్తికోట శివాలయం దగ్గర ఈ ఘోరం జరిగింది. మృతులు హనుమమ్మ, సత్య లక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు.  శివరామి రెడ్డి ఆలయ పూజారి అని, హనుమమ్మ అతని అక్క అనీ స్థానికులు చెబుతున్నారు. సత్య లక్ష్మి వారి బంధువని తెలిసింది.

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయానికి చేరుకొన్ని అక్కడున్న వారి ముగ్గురిని పాశవికంగా హత్య చేశారు. వారి రక్తాన్ని శివలింగం మీద. గుడిలో ఉన్న పుట్టల మీద చల్లారు. క్షుద్ర పూజల కోసమే వీరిని నరబలి ఇచ్చారని అక్కడి వార అంటున్నారు.