బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ సిటీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ నేతృత్వంలో విజయోత్సవ సభ జరిగింది. ఇందులో 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ఎంపీ మయాంక్ నాయక్ జూమ్ ద్వారా మాట్లాడారు. బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
