జూన్ ​6 నుంచి త్రోబాల్​ చాంపియన్​షిప్

జూన్ ​6 నుంచి త్రోబాల్​ చాంపియన్​షిప్

ఖైరతాబాద్, వెలుగు : వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో సిటీలో 47వ సీనియర్ ఇంటర్నేషనల్ త్రోబాల్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు స్టేట్​త్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్​చైర్మన్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమవారం ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జూన్​6 నుంచి 8 వరకు హయత్​నగర్​లోని వర్డ్ డీడ్ ఎడ్యుకేషన్ అకాడమీలో మూడురోజులపాటు త్రోబాల్​పోటీలు ఉంటాయని చెప్పారు.

26 రాష్ట్రాలకు చెందిన 750 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు. ఈ నెల 25న వర్డ్​డీడ్​అకాడమీలో తెలంగాణ త్రోబాల్​టీమ్​ఎంపిక ఉంటుందని, ఆసక్తిగల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరవుతారని చెప్పారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కృష్ణరాజ్​ఫుత్, చిత్ర, కోశాధికారి జమీల్, జాయింట్​సెక్రటరీ శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.