నల్లమలలో పెరిగిన పులులు

నల్లమలలో పెరిగిన పులులు

నాగర్​ కర్నూల్,​ వెలుగు: నల్లమల ఫారెస్ట్​పరిధిలోని కొల్లాపూర్​ రేంజ్ లో పులుల సంఖ్య పెరిగింది. నల్లమల ఫారెస్ట్​లో  గత ఏడాది  21  పులులుండగాప్రస్తుతం వాటి సంఖ్య 30కి చేరింది.  ఇందులో కొల్లాపూర్​ రేంజ్​లోనే  8 పులులున్నట్టు  అధికారులు చెప్తున్నారు.  ఇందులో ఒక మగ పులి, రెండు ఆడ పులులు, 5 పులి పిల్లలు ఉన్నాయి. రేంజ్​లో   చిరుతల సంఖ్య కూడా20కి చేరింది. రేంజ్​పరిధిలోని  ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, చంద్రబండతాండా మండలాల పరిధిలో పులులు, చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. 

నల్లమల ఫారెస్ట్​లో పులుల సంతతిని పెంచేందుకు రెండేళ్లుగా తీసుకుంటున్న చర్యలు  ఫలితాలనిచ్చాయి.  పులులు తిరిగే  ప్రాంతాల్లో  వాటర్​ సాసర్స్ ఏర్పాటు చేయడం, ఆహారానికి  కొరత రాకుండా  చూడడం వల్ల పులుల, చిరుతల సంఖ్య పెరిగింది. కొల్లాపూర్​రేంజ్ పరిధిలో దాదాపు 40, లింగాల రేంజ్​లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.  సీసీ ఫుటేజీ ​ ఆధారంగా పులుల లెక్క తేల్చారు.  కొల్లాపూర్ రేంజ్ పరిధిలో  15 మంది రెగ్యులర్​ సిబ్బందితో పాటు రెండు బేస్​ క్యాంపుల్లో 15 మంది వాచర్లు పని చేస్తున్నారు. పులుల  కదలికలు పెరగడంతో  కొత్తగా మూడో బేస్​ క్యాంప్​ ఏర్పాటు చేశారు. దీనికోసం ఐదుగురు చెంచు యువకులను వాచర్లుగా తీసుకున్నారు.

డీప్​ ఫారెస్ట్​లోనే పులుల సంచారం

పులులు, చిరుతల సంచారం డీప్​ ఫారెస్ట్​లోనే ఉంది. దీనివల్ల వాటి ఫుడ్​కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడా మనుషులు, జంతువులపై దాడి చేసిన ఘటనలు లేవు. డీఎఫ్​ఓ  రోహిత్​ గోపిడి చొరవ వల్ల  రేంజ్​పరిధిలో ​  పులుల సంఖ్య పెరిగింది.

- శరత్ చంద్రారెడ్డి,  ఎఫ్ఆర్వో, కొల్లాపూర్