మెదక్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత : ఎస్పీ శ్రీనివాస్ రావు

మెదక్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత  : ఎస్పీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్​, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్​ను శుక్రవారం ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.