- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. ముమ్మర తనిఖీలు
పద్మారావునగర్,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇటీవల జరిగిన పేలుడు సంఘటన దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ బీడీడీఎస్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ప్రయాణికుల లగేజీ, ఇతరత్రా వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రాంతాలు, వెయిటింగ్ హాల్స్, సర్క్యలేటింగ్ ప్రాంతాలు, రైళ్లు, పార్శిల్ కార్యాలయంతో పాటు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
యాంటీ- సాబాటేజ్ డ్రిల్స్ నిర్వహించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ బీఎస్ సారస్వత్, ఎస్ఐ వెంకట్ రెడ్డి, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్, ఎస్సై రమేశ్ తదితరులు
పాల్గొన్నారు.
