డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు బిగుస్తున్న ఉచ్చు

డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు బిగుస్తున్న ఉచ్చు

డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి, సంజనలకు ఉచ్చు బిగుస్తుంది. వారి నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో తేలింది. దాంతో వారిద్దరికీ మరోసారి సమన్లు జారీ చేయాలని బెంగుళూరు పోలీసులు నిర్ణయించారు. మొదట ఈ ఇద్దరు హీరోయిన్ల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిళ్లను ల్యాబ్ కు పంపారు. వాటిలో ఫలితం సరిగా తేలకపోవడంతో.. అక్టోబర్ 2020లో మరోసారి వారి వెంట్రుకల నమూనాలను సేకరించి.. ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ రిపోర్ట్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో హీరోయిన్లద్దరికీ త్వరలోనే సమన్లు ఇవ్వనున్నారు. దాంతో వారికి డ్రగ్స్ కేసులో శిక్ష తప్పేలా కనిపించడం లేదు.