కేసీఆర్ పాలనకు టైమ్ ముగిసింది : పియూష్ గోయల్

 కేసీఆర్ పాలనకు టైమ్ ముగిసింది :  పియూష్ గోయల్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు టైమ్ ముగిసిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అధికార పార్టీని ప్రజలు ఓడించబోతున్నారని తెలిపారు. కమీషన్ల కోసం కేసీఆర్ క్వాలిటీలేని ప్రాజెక్టులు నిర్మించాడని ఆరోపించారు. గురువారం ఆయన సోమాజిగూడలోని బీజేపీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.  ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేసే కేసీఆర్ ను ఫార్మ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నట్లు పియూష్ గోయల్ అన్నారు.

కేంద్రం గత 9 ఏండ్ల నుంచి ఎలాంటి వివక్ష చూపకుండా  రాష్ట్రానికి  లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని వెల్లడించారు.బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని, ఒవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని పియూష్ పేర్కొన్నారు.