తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల కలకలం

తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల కలకలం

తిరుమలలో నకిలీ అభిషేకం టికెట్ల గుట్టు రట్టైంది. టీటీడీ కేటుగాళ్లకు అడ్డగా మారింది. గతంలో పలుమార్లు టికెట్ల నకిలీ టికెట్లతో పలువురు పట్టుబడ్డా..అధికారులు అలసత్వం వల్ల అక్రమార్గంలో డబ్బులు సంపాధించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి అభిషేకం టికెట్లను పోలిన 14 నకిలీ టిక్కెట్ల తో వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నకిలీ టికెట్లపై విచారించగా చెన్నైకి చెందిన ముఠా 14 నకిలీ టికెట్లను రూ.73 వేలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ముఠా నుంచి నకిలీ టికెట్లు పొందిన భక్తుల గత శుక్రవారం మూడు టికెట్లతో అభిషేకానికి ప్రవేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1వద్ద చేపట్టిన తనిఖీలలో నకిలీ గా గుర్తించిన విజిలెన్స్  అధికారులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.