ఎన్నాళ్లకెన్నాళ్లకు : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కేవలం ఐదు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కేవలం ఐదు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు..

తిరుమల కొండకు భక్తుల తాకిడి కొద్దిగా తగ్గింది.  నిన్నటి వరకు  అన్ని కంపార్ట్​ మెంట్లు పూర్తిగా నిండాయి.  కాని ఈ రోజు ( ఆగస్టు 24) కేవలం ఐదు కంపార్ట్​ మెంట్లలో భక్తులు ఉన్నారు. తిరుమలలో  భక్తుల రద్దీ తగ్గింది.  ఈ రోజు ( ఆగస్టు 24) స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.  ప్రతి వీకెండ్​ సమయంలో భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల..  ఈ  వీకెండ్ లో ( ఆగస్టు  24)  భక్తుల రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు.

 సాధారణంగా ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇవ్వాళ ( ఆగస్టు 24)  రద్దీ లేకపోవడంతో భక్తులు త్వరగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు.  గత 5 నెలల కాలంగా  తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం సైతం బాగా పెరిగింది

శ్రీవారి  లడ్డూ విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. క్యూ లైన్ లు బయట వరకూ విస్తరించడం, కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోవడంతో నిన్నటి  ( ఆగస్టు 23) వరకూ తిరుమల భక్త జన సంద్రంతో కిటకిట లాడింది. కానీ 

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఉచిత సర్వ దర్శనం భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం, రూ. 300/- ప్రత్యేక దర్శనం భక్తులకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. 

  శనివారం ( ఆగస్టు 23) తిరుమల శ్రీవారిని 83 వేల 858 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26 వేల 034 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ  అధికారులు తెలిపారు.