
- రోజుకు వెయ్యి మందికి అవకాశం
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. రోజుకు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనున్నారు. రెండు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ సదుపాయం ఉంటుంది. టీఎస్ఆర్టీసీ (TSRTC) విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్కు, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల కోసం ‘టీ-2’ పోర్టల్ అందుబాటులోకి తెచ్చామని, దాంట్లో లాగిన్ అయి టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపారు. బస్సుల్లో దర్శనానికి వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా రెండు డోసుల టీకా సర్టిఫికెట్, లేదా 72 గంటల్లోపు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం : -
మద్యం మత్తులో పెరిగిపోతున్న నేరాలు
సిటీలో బాలికపై రేప్ జరుగుతుంటే షీ టీమ్స్ ఏం చేస్తున్నయ్?