టీఎంసీ లీడర్​ అనుబ్రత అరెస్టు

టీఎంసీ లీడర్​ అనుబ్రత అరెస్టు

బోల్ పూర్/కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ లీడర్, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మండల్​ను సీబీఐ అరెస్టు చేసింది. 2020లో నమోదైన పశువుల అక్రమ రవాణా కేసులో గురువారం ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు సహకరించకపోవడంతోనే మండల్ ను అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ 10 సార్లు నోటీసులు ఇవ్వగా, ఒక్కసారి కూడా ఆయన హాజరుకాలే. దీంతో 8 మంది సీబీఐ అధికారులు గురువారం బీర్భూమ్ జిల్లా బోల్​పూర్​లో మండల్​ను అరెస్టు చేశారు.