బోల్ పూర్/కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ లీడర్, టీఎంసీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మండల్ను సీబీఐ అరెస్టు చేసింది. 2020లో నమోదైన పశువుల అక్రమ రవాణా కేసులో గురువారం ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు సహకరించకపోవడంతోనే మండల్ ను అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ 10 సార్లు నోటీసులు ఇవ్వగా, ఒక్కసారి కూడా ఆయన హాజరుకాలే. దీంతో 8 మంది సీబీఐ అధికారులు గురువారం బీర్భూమ్ జిల్లా బోల్పూర్లో మండల్ను అరెస్టు చేశారు.
#UPDATE | West Bengal: Central Bureau of Investigation (CBI) gets 10-day custody of TMC Birbhum district president Anubrata Mondal in the cattle smuggling case. https://t.co/iE0Ui4xTQ6
— ANI (@ANI) August 11, 2022