
డిచ్పల్లి, వెలుగు: సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనివర్సిటీలో స్టూడెంట్స్ధర్నాకు దిగారు. మంగళవారం ఆందోళన చేయగా, బుధవారం కూడా తరగతులు బహిష్కరించి టీయూ మెయిన్ గేట్ఎదుట బైఠాయించారు. వీరికి మద్దతుగా బీజేపీ లీడర్లు నిరసనలో పాల్గొన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం వర్సిటీలోని వీసీ గెస్ట్హౌజ్ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకున్నా వినలేదు. సమస్యలపై వైస్చాన్స్లర్ రవీందర్ను నిలదీయగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పది రోజుల్లో అంబులెన్స్కొంటాం
పది రోజుల్లో అంబులెన్స్ కొంటామని, హెల్త్ సెంటర్లో మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూస్తామని వీసీ రవీందర్ హామీ ఇచ్చారు. వైఫై కోసం రూటర్లు కొన్నామని, త్వరలో వైఫై ఇన్స్టాల్ చేయిస్తామన్నారు. స్పోర్ట్స్బోర్డు ఏర్పాటు చేశామని, ప్లే గ్రౌండ్ని క్లీన్ చేయిస్తున్నామని, స్పోర్ట్స్ఎక్విప్మెంట్ కోసం రూ.25 లక్షలు కేటాయిస్తామన్నారు. మెస్ లలో అదనపు టేబుల్స్, కుర్చీలు సమకూరుస్తామన్నారు. హాస్టల్స్లో మూడు జిరాక్స్ మెషీన్లు ఏర్పాటు చేస్తామని, గర్ల్స్హాస్టల్పై అదనంగా మరో ఫ్లోర్ నిర్మిస్తామన్నారు. కొత్తగా ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, ఆర్అండ్బీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డిని కలిసి బిల్డింగ్స్నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వర్సిటీ లో కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో స్టూడెంట్స్ హాస్టల్స్కు వెళ్లిపోయారు.