
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,091కి చేరింది. 1,53,178 యాక్టివ్ కేసలుండగా..1,80,013 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 380 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 9,900కి చేరింది. అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమళనాడుల్లోనే నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ.