హైదరాబాద్, వెలుగు: ఎస్బీఐ దేశవ్యాప్తంగా ఇవాళ ‘కస్టమర్ మీట్’ను నిర్వహిస్తోంది. బ్యాంక్తో కస్టమర్లకున్న అనుభవాన్ని తెలుసుకునేందుకు, మెరుగైన సర్వీసులను అందించేందుకు ఎస్బీఐ ఈ మీట్ చేపడుతోంది. డిజిటల్ పేమెంట్ విధానాలపై కస్టమర్లకు అవగాహన కల్పించడంతో పాటు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలను కస్టమర్లకు తెలియజేయనుంది.
సేఫ్ డిజిటల్ బ్యాంకింగ్ విధానాలపై కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయనుంది. తెలంగాణ లోకల్ హెడ్ ఆఫీసుల్లోని(ఎల్హెచ్ఓస్) 26 లొకేషన్స్లో ఎస్బీఐ ఈ మీట్ నిర్వహించనుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఎస్బీఐకి ఉన్న 17 ఎల్హెచ్ఓస్ నుంచి 517 లొకేషన్స్ ద్వారా కస్టమర్లను చేరుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్యాంకు తెలిపింది.