భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా ఈరోజు జరగాల్సిన పవన్ కళ్యాణ్ భీంలా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌, రానా నటించిన భీమ్లానాయక్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇవాళ హైదరాబాద్‌లో జరగాల్సింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఏపీ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నాకు మనసు అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే ఇవాళ జరగాల్సిన ‘భీమ్లా నాయక్’ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇకలేరు

గౌతమ్ రెడ్డిని ఆస్పత్రికి తెచ్చేటప్పటికే శ్వాస ఆడడం లేదు

ఏపీలో 2 రోజులు సంతాప దినాలు