ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ

ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో హీరో రవితేజ కొద్దిసేపటి క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత డ్రైవర్ తో కలసి ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. రవితేజ ఈడీ ముందు హాజరయ్యే న్యూస్ కవర్ చేసేందుకు మీడియా తెల్లవారుజాము నుంచే ఆయన ఇంటి వద్ద పడిగాపులు గాయగా.. ఆయన ఆచూకీ కనిపించలేదు. అయితే వేరే గెస్ట్ లో ఉండి.. అక్కడి నుండి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
డ్రగ్స్ లావాదేవీలు నడిపిన ప్రధాన నిందితుడు కెల్విన్ బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు నడిపిన వారినందరినీ ఈడీ ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ ఉపయోగించేవారా లేదా.. తేల్చుకునే పనిలో పడ్డ ఈడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీతిసింగ్ తదితరులను వరుసగా ప్రశ్నించిన ఈడీ ఇవాళ గురువారం హీరో రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ లను విచారణకు పిలిచింది.