
‘రాజుగారి గది’ సిరీస్తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్.. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తను హీరోగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హిడింబ’ చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది. తాజాగా అశ్విన్కి సంబంధించి మరో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది.
మెడికల్ థ్రిల్లర్గా రూపొందబోయే ఈ చిత్రంతో ఎం.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పిల్ల జమీందార్, ద్రోణ వంటి సినిమాలను నిర్మించిన డి.ఎస్.ఆర్ సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.