సదాశివపేటలో టమాటలు చోరీ...ఇనుప గ్రిల్స్​ వంచి

సదాశివపేటలో టమాటలు చోరీ...ఇనుప గ్రిల్స్​ వంచి
  •      10 బాక్సుల విలువ రూ.40 వేలు

సదాశివపేట, వెలుగు: టమాట ధరలు పెరిగిపోవడంతో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మార్కెట్​లో దొంగలు టమాటలు ఎత్తుకెళ్లారు. సదాశివపేట కూరగాయల మార్కెట్ యార్డ్​లో  (బీట్) లో రాములు అనే కూరగాయాల వ్యాపారి షాపులో సోమవారం రాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు రూ.40 వేల విలువైన 10 బాక్స్​ల టమాటలు చోరీ చేశారు. 

ఐరన్ ​గ్రిల్స్​ వంచి లోపలున్న టమాటలు మాయం చేశారు. తెల్లారి షాపుకు వచ్చిన రాములు గ్రిల్స్​వంచి ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా టమాటలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సదాశివపేట సీఐ నవీన్​కుమార్​ తెలిపారు.