జీహెచ్ఎంసీలో బీజేపీ బస్తీ నిద్ర

జీహెచ్ఎంసీలో బీజేపీ బస్తీ నిద్ర

రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీలో బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. టెలికాన్ఫరెన్సులో నాయకులకు దిశా నిర్దేశం చేసిన బండి సంజయ్..  ‘బస్తీ నిద్ర’ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిచ్చారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వీలైనంత మేరకు పాల్గొంటామన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాను బస్తీ నిద్ర చేస్తానన్నారు. బస్తీ నిద్ర కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలన్నారు.  బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని కోరారు.  బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమాన్ని వారానికి ఒక రోజు నిర్వహించాలన్నారు.