
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు మరోసారి వాయిదా పడే అవకాశం కన్పిస్తోంది. దోషులను విడివిడిగా ఉరి తీయాలంటూ కేంద్ర హోంశాఖ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మార్చి ఐదవ తేదీకి వాయిదా వేసింది. నిర్భయ దోషులను మార్చి 3వ తేదీన ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని ఇప్పటికే పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హోంశాఖ పిటిషన్ ను సుప్రీంకోర్టు మార్చి ఐదవ తేదీకి వాయిదా వేయడంతో.. అప్పటి వరకు ఉరి శిక్ష అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు డెత్ వారెంట్ ఇచ్చినా.. దోషులు కోర్టులకు వెళ్లడంతో వాయిదా పడింది.